• Login / Register
  • Universities | యూనివ‌ర్సిటీల గౌర‌వాన్ని పెంచాలి

    Universities | యూనివ‌ర్సిటీల గౌర‌వాన్ని పెంచాలి
    వ‌ర్సిటీల్లో వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిన్నాయి
    వ‌ర్సిటీల‌లో గంజాయ‌, డ్ర‌గ్స్ వినియోగంపై న‌జ‌ర్ వేయాలి
    వైస్ ఛాన్స‌ల‌ర్ల‌కు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం

    Hyderabad : ప్ర‌స్తుతం రాష్ట్రంలో అన్ని యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం పెంచే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా వీసీల‌కు సీఎం దిశా నిర్దేశం చేశారు. శ‌నివారం ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కిష్ణారెడ్డి, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో వీసీల‌తో సీఎం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. యూనివర్సిటీ లపైన నమ్మకం కల్గించేలా పని చేయాల‌న్నారు. కొంత కాలం గా యూనివర్సిటీ పైన నమ్మకం తగ్గుతోంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచే విధంగా అంద‌రూ క్రుషి చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం యూనివర్సిటీ ల్లో వ్యవస్థ లు బాగా దెబ్బతిన్నాయ‌ని, ఆయా వ్యవస్థ ల పునరుద్ధరణ కు ఏం చేయాలో అధ్యయనం చేయాని నిర్దేశం చేశారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాల‌ని సూచించారు. అవసరమైతే కన్సల్టెన్సీ లను ఏర్పాటు చేసుకొని నివేదిక రూపొందించుకోవాల‌ని పేర్కొన్నారు. వైస్ ఛాన్సలర్లకి ఎవరి ప్రభావితం తో పోస్ట్ లు ఇవ్వలేద‌ని, ప్ర‌తిభ‌, సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా సీఎం స్ప‌ష్టం చేశారు. బాగా  పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల‌న్నారు. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్ల కి స్వేచ్ఛ ఉంటుందని,  అందుకోసం ప్రభుత్వ నుంచి కూడా సహకారం ఉంటుంద‌ని చెప్పారు. యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాల‌ని,  గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల ను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు అని, కాని ఇప్పుడు  ఆ పరిస్థితి లేద‌ని గుర్తు చేశారు. యూనివర్సిటీ ల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాల పైన ద్రుష్టి సారించాల‌ని, ఈ కోణంలో విద్యార్థులను గమనించి వారికి ఎప్ప‌టిక‌ప్పుడు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అంశాల‌పై బాధ్యత తీసుకోవాల‌ని సీఎం వీసీల‌ను ఆదేశించారు. 
    *  *  *

    Leave A Comment